భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ సోమవారం అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీశ్‌రావు తదితర బీఆర్‌ఎస్ నేతలు నల్లదుస్తులతో నిరసన చేపట్టగా పోలీసులు వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు అవమానకరంగా వ్యవహరించారని బీఆర్‌ఎస్…