భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కరెంటు కోతలను వెంటనే ఎత్తివేయాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.500 సబ్సిడీ గ్యాస్ను అందించాలని కోరుతూ బీజేపీ నెల్లికుదురు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజకుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎంపీడీవో సింగారపు కుమార్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా చందు రాజకుమార్ మాట్లాడుతూ మండలంలోని పలు ప్రాంతాల్లో రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. తరచూ…





