భారత్ సమాచార్ మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ ఉద్యమకారుల 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు ఈ నెల 27న నిర్వహించే ‘ఛలో యాదగిరిగుట్ట’ కార్యక్రమానికి ఉద్యమకారులు భారీగా తరలిరావాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల చంద్రమౌళి గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లికుదురులో ఆయన మాట్లాడారు.
తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈ నెల 27న యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు చంద్రమౌళి గౌడ్ తెలిపారు. సంఘం ఫోరం…





