భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అభివృద్ధి సంక్షేమ పథకాలు,మౌలిక వసతులు,ప్రణాళిక ల రూపకల్పన లో జనాభా గణన ఉపయోగ పడుతుందని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో చార్జి అధికారులకు నిర్వహిస్తున్న మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న తొలి జనగణన అని, 2011 జనాభా గణన తర్వాత 2021…