భారత్ సమాచార్, వెబ్డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్కు గాయం రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. మ్యాచ్ సమయంలో బ్యాటింగ్ చేస్తుండగా ఆయన మెడ ప్రాంతంలో తీవ్రమైన నొప్పి అనుభవించారు. దాంతో వెంటనే మైదానాన్ని వీడి బయటికి వెళ్లారు. మొదట తేలికపాటి గాయంగా భావించినా, పరిస్థితి విషమించడంతో గిల్ను తక్షణమే అంబులెన్సులో కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించారు.
తాజా సమాచారం ప్రకారం, వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. గిల్కు సర్వైకల్ ప్రాంతంలో గాయం తీవ్రంగా…




