భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి (Vice President), రాజ్యసభ ఛైర్మన్ (Rajya sabha Chairman) జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిని (President) సుప్రీంకోర్టు (Supremecourt) ఆదేశించలేదని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి ఇదే అంశంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ సంబంధిత విషయాల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ మాస్టర్స్ (Ultimate Masters) అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
…




