భారత్ సమాచార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్ నందు కొమరం భీమ్ జయంతి సందర్భంగా విప్లవ వీరుడు కొమరం భీం విగ్రహానికి పినపాక శాసనసభ్యులు  వెంకటేశ్వర్లు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి MLA మాట్లాడుతూ ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక, విప్లవ వీరుడు కొమురం భీమ్. అడ‌వి బిడ్డ‌ల ఘీంకార స్వ‌రం ఆయ‌న అని,ఆదివాసుల స్వ‌యం ప్ర‌తిప‌త్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్య‌మ‌బావుట, దేశానికి స్వాతంత్రం రాకముందే ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరు తలపెట్టిన పోరాట యోధుడు కోమరం…