భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మండల కేంద్రంలోని ఇనుగుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం సర్పంచ్ తమ్మడపల్లి కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా తన మాటలు, కవితల ద్వారా ధిక్కార స్వరాన్ని వినిపించిన గొప్ప ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా ఎత్తిచూపుతూ, సమాజంలో…





