భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం, సరస్వతి సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ విభాగ కార్యవాహ బోలా నాగభూషణం హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన మాతృభాషను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, అదే విధంగా స్వదేశీ వస్తువుల వినియోగం ద్వారా దేశ ఆర్థిక బలం పెరుగుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మన జీవన విధానానికి మూలాధారమని, వాటిని గౌరవిస్తూ ముందుకు సాగాలని…