భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఏడుపాయల వన దుర్గ మాత ఆలయ ప్రాంగణంలో సదాశివపేట మండలం నాసన్‌పల్లి గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఈరోజు ఉదయం ఆ మొబైల్ ఫోన్ లభ్యమైంది. అనంతరం రాములును పిలిపించి, మెదక్ రూరల్ సీఐ జార్జ్ డిసిఆర్బి ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి చేతుల మీదుగా…